అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ మంచి ప్రభావం చూపించింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా జనసేన పార్టీ ప్రభావం కనబడింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా వరకు కూడా జనసేన పార్టీ కార్యకర్తల బలం తో ఎక్కువగా పంచాయతీలను గెలుచుకుంది. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా జనసేన పార్టీ ప్రభావం కనబడింది అనే మాట వాస్తవం. నాలుగు జిల్లాల్లో కూడా జనసేన పార్టీ ద్వితీయ స్థానంలో ఎక్కువగా నిలబడటం జరిగింది.
ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే తెలుగుదేశంకు బలం ఉన్న నియోజకవర్గాల్లో కూడా కాపు సామాజికవర్గం మొత్తం జనసేన పార్టీకి మద్దతు ఇచ్చింది. దీనితో జనసేన పార్టీ నేతల్లో ఉత్సాహం వస్తుంది అని చెప్పాలి. ఇక జనసేన పార్టీ కి డబ్బులు లేకపోయినా పెద్దగా నాయకత్వ బలం లేకపోయినా సరే గ్రామాల్లో ప్రభావం చూపించడంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ద్వితీయ స్థానా ల్లో జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో నిలబడటం పై ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేదానిపై మాత్రం ఇంకా జనసేన పార్టీ స్పష్టత ఇవ్వడం లేదు.