రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడాలేదు అని హరీష్ రావు స్పష్టం చేసారు. ఏ రాష్ట్రానికి అయినా వెళదాం... ఎక్కడా ఉచితంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. చేతల మనుషులు కావాలా.... మాటల మనుషులు కావాలా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఆరేళ్లలో 33/11 కెవి సబ్ స్టేషన్లు వేయి నిర్మించాం అని ఆయన వెల్లడించారు. అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు పదహారు ఉన్నాయి అని... అక్కడ ఎందుకు 24 గంటల ఉచిత విద్యుత్ లేదు అని ప్రశ్నించారు. కనురెప్ప పాటు కూడా విద్యుత్ కోత లేని రాష్ట్రం తెలంగాణ అని ఆయన కొనియాడారు. 70 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాలను విడిచి ప్రజలు వలస వెళ్లారు అని అన్నారు. తెరాస పాలనలో ఊళ్లల్లకు తిరిగి వస్తున్నారు అని ఆయన హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ ఎవరు తెచ్చారో ఈలోచించాలి అని... రాజీనామాలు చేయ మంటే పారిపోయిన వాళ్లు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పుడు 7778 మెగావాట్లు డిమాండ్ ఉంది. ఇప్పుడు అది 16,249 మెగావాట్లు అని పేర్కొన్నారు.