విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ టీడీపీ... టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారింది. ఇక మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, విజయవాడ ఎంపీ కేశినేని నానీ కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా జలీల్ ఖాన్ మరోసారి మీడియాతో మాట్లాడారు. వెల్లంపల్లి కి రాజకీయ భిక్ష పెట్టింది నేనే అని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. వెల్లంపల్లి సింహం అని చెప్పుకుంటున్నారు అని ఆయన గ్రామ సింహం మాత్రమే అని ఎద్దేవా చేసారు.

వెల్లంపల్లి ఒంటి నిండా అవినీతి మచ్చలే అని ఆరోపణలు చేసారు. జలీల్ ఖాన్ అంటే ఒక బ్రాండ్ అంటూ వెల్లంపల్లి లా లుచ్చాను కాదు అని ఆయన ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వెల్లంపల్లి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. కొబ్బరి చిప్పల్లో, చెప్పుల స్టాండ్ లోను మంత్రి అవినీతికి పాల్పడ్డారు అని ఆయన ఆరోపించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ హద్దులు మంత్రి వెల్లంపల్లి చెప్తే... నేను విజయవాడ నగరం వదిలి వెళ్లిపోతా అని ఆయన సవాల్ చేసారు.

ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు మంత్రిపై చర్యలు తీసుకోవడం లేదు అని నిలదీశారు. మంత్రి అవినీతిలో సీఎం కి వాటా ఉంది అనే అనుమానం మాకు ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వెల్లంపల్లి ఆయనకు నచ్చిన చోట కార్పొరేటర్ గా పోటీ చేస్తే... నేను చిన్న కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తా అని ఆయన సవాల్ చేసారు. దుర్గ గుడి ఈవో ను వెంటనే విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసారు. ఈవో కు నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి అని ఆయన అన్నారు. వెల్లంపల్లి కాదు... వెల్లంపిల్లి గా చూస్తాం అని, ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని దోచుకుంటున్నాడు అని ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: