ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత విధ్వంసకారుడని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆయన పరిస్థితి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌న్నా దారుణంగా ఉంటుందన్నారు. 'మోదీ దేశంలోనే అత్యంత హింసాత్మక వ్యక్తి... ట్రంప్‌ పరిస్థితి ఏమైంది... మోదీ పరిస్థితి కూడా అంతే. హింసతో సాధించేది ఏమీ లేదు.' అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ-బీజేపీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగ‌రేసేందుకు టీఎంసీని బీజేపీ ముప్పు తిప్పలు పెడుతుండగా... మమతా బెనర్జీ ఏమాత్రం అద‌ర‌డంలేదు. బెంగాల్‌‌ను బెంగాల్ మాత్రమే పాలిస్తుందని... గుజరాత్ పాలించదన్నారు. హూగ్లీ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా... ప్రధాని మోదీ, అమిత్‌షా పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దేశాన్ని అధ్వాన్న‌స్థితికి తీసుకువెళ్లార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత విధ్వంసకారుడని,  ప్రస్తుతం ఈ దేశాన్ని ఒక రాక్షసుడు, ఒక రావణుడు నడిపిస్తున్నారని మోదీ,అమిత్ షాలను ఉద్దేశించి మమత‌ విమర్శించారు. మోదీ, ఆయన రాక్షస స్నేహితుడు చాలా చాలా మాట్లాడుతున్నారు. కానీ వాళ్లు మాట్లాడేది రెండునెల‌లే. ఆ తర్వాత మాట్లాడేది మేమే.. బెంగాల్‌‌లో బీజేపీ ఎట్టి ప‌రిస్థితుల్లోను విజ‌యం సాధించ‌లేదు. ఈ గ‌డ్డ‌పై బీజేపీకి స‌మాధి క‌డ‌తాను. ప్రధాని పదవి పట్ల నాకు గౌరవం ఉంది... ఇవాళ ఆ స్థానంలో మోదీ ఉన్నారు.. రేపు ఉండరు... మోదీ చెప్పేవన్నీ అబద్దాలే..' అని మమతాబెన‌ర్జీ మండిప‌డ్డారు. ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌ల‌తో మాట్లాడ‌టానికి ప్ర‌ధాన‌మంత్రి మోడీకి అనువాద‌కులు అవ‌స‌ర‌మ‌ని, కానీ బెంగాల్‌వాళ్లే బెంగాల్ ప్ర‌జ‌ల‌తో మాతృభాష‌లో మాట్లాడ‌గ‌ల‌ర‌ని మమ‌త అన్నారు. ఈ దేశాన్ని రావ‌ణాసురుడు, రాక్ష‌సుడు పాలిస్తున్నారు బెంగాల్‌లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ర‌వైంద‌ని మోడీ అంటున్నార‌ని, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌దిత‌ర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఉందా? అని నిల‌దీశారు. చివ‌ర‌కు ఆ పార్టీ మ‌హిళా నేత‌ల‌కే ఆ రాష్ట్రాల్లో ర‌క్ష‌ణ లేద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: