ఈ మధ్య కాలం లో ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా ఆత్మహత్యలకు చిరునామాగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది మోసగాళ్లు ప్రేమ పేరుతో యువతులకు వలవేసి చివరికి శారీరకంగా మానసికం గా ఆర్థికంగా వాడుకొని ఇక నడిరోడ్డు పై వదిలేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అనే విషయం తెలిసిందే. ప్రేమ అంటే అవసరాలకు వాడుకునే  ఒక ఆయుధంగా మారి పోయింది నేటి రోజుల్లో.  ఏదో ఒక విధంగా యువతులకు మాయ  మాటలు చెప్పి బుట్టలో వేసుకొని ఇక ఆ తర్వాత మోసం చేస్తున్నారు ఎంతో మంది. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి తరహా అనుభవమే ఎదురైంది.


 ఓ వ్యక్తిని మనసారా ప్రేమించింది ఓ యువతి. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఈ క్రమం లోనే ఇంట్లో నుంచి వెళ్ళి పోయింది.  అయితే కొద్ది రోజులు గడిచి పోయాయి ఇక ఇంతలోప్రియుడి అసలు నిజ స్వరూపం బయట పడింది.  తల్లి దండ్రులను కాదని ప్రియుడితో వస్తే ఇక ప్రియుడు నిజ స్వరూపం బయట పోవడంతో తట్టుకోలేకపోయింది. చివరికి లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలోచోటు చేసుకుంది.



 కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి కి చెందిన యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేందుకు ధైర్యం చెయ్యలేక ఇంటి నుంచి పారిపోయారు.అయితే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో యువతి జీవితంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ప్రియుడు మోసం బయటపడింది. అతనికి గతంలోనే పెళ్లయిందని బయటపడడంతో తట్టుకోలేకపోయిన ప్రియురాలు చివరికి మోసాన్ని భరించలేక కఠిన నిర్ణయం తీసుకొని గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: