ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఎన్నికల అయిపోగా మరి కొన్ని ప్రదేశాలలో ఇంకా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం  మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు .ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా మంత్రి కన్నబాబు కాచిన టీ సూపర్ అంటున్న వెల్లంపల్లి వాసులు. ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.                                                                                                                            



 మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కొండవీడు అకాడమీ నుంచి ప్రియదర్శిని కాలనీ, పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


 ఈ మంత్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు టి దుకాణం వద్ద కొద్దిసేపు ఆగి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ స్టార్ యజమాని పలకరించారు. అంతేకాదు మంత్రి స్వయంగా ఛాయ్ పెట్టి అక్కడ ఉన్న అందరికి తాగించారు.


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కులమతాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టిడిపి నేతలు పగటి కలలు కంటున్నారని పశ్చిమ నియోజకవర్గం లోని అన్ని డివిజన్లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కన్నబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: