ఇక ఈ మధ్యనే విజయవాడ దుర్గ గుడి లో ఏసీబీ అధికారులు సోదాలు నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించి మంత్రి పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పు చేస్తే బొక్కలు పగులుతాయి బాబు మెదడును కాపాడుకోవాలి అంటూ పేరు నాని వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


 దుర్గగుడి లో ఏసీబీ సోదాలు చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నాని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరి కోసమో రైడ్లు చేసే చంద్రబాబు ప్రభుత్వం కాదిది అంటూ నాని చురకలంటించారు. చంద్రబాబు లాగా పది గురువులు పది మతాలు మార్చలేదు కదా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.                                                                                  


 ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అని నాని  మండిపడ్డారు. దుర్గ గుడి ఈవో తప్పు చేశారని లెక్కతెలీతే బొక్కలు తగులుతాయి అని హెచ్చరించారు. అవినీతిని ఉపేక్షించే విషయంలో ఈవో లేదు డీవో లేదు అందరిమీద చర్యలు తీసుకుంటామన్నారు నాని. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మేం మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందే లేమా అని పేర్కొన్నారు.


 అవసరాల కోసం ఓటర్లకు ఎరవేసే పార్టీ తమది కాదని అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు. మతాలు మార్చే వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన మెదళ్లను విజయవాడ మ్యూజియంలో పెట్టాలి అని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: