ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం నామినేషన్లు పూర్తయ్యే సరికి మాచర్ల మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో ఏకగ్రీవం చేసేలా ఆయన దూసుకుపోతున్నారు. పట్టణంలో ఉన్న 31 వార్డులకు 10 వార్డులలో వైసిపి అభ్యర్థులు సింగిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ 10 వార్డులు ఇప్పటికే అధికార వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేసరికి మరో ఐదు వార్డుల్లో వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవం అయితే మాచర్ల మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తవ్వకుండానే వైసీపీ ఖాతాలో పడినట్టే.
ఆ తర్వాత కొన్ని వార్డులకు నామమాత్రంగా ఎన్నికలు జరిగినా మునిసిపాలిటీని ఏకగ్రీవం చేసి రాష్ట్రస్థాయిలోనే మరో రికార్డును విఫ్ రామకృష్ణారెడ్డి తన ఖాతాలో లిఖించుకున్న వారు అవుతారు. మంత్రి పెద్దిరెడ్డిని మినహా యిస్తే ఆ తర్వాత ఆ రేంజ్లో అటు పంచాయతీలు.. ఇటు మున్సిపాల్టీల్లో ఈ స్థాయిలో ఏకగ్రీవాలు చేసిన ఏకైక ఎమ్మెల్యేగా రామకృష్ణా రెడ్డి నిలిచిపోతారనే చెప్పాలి.