నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఏదొఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. భార్యాభర్తల గొడవ రూపంలోనో, ఇతర వ్యవహారాల్లోనూ స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థినిని తోటి విద్యార్థే అత్యంత దారుణంగా నమ్మించి చంపేశాడు. కాలేజీల్లోనే కాదు, సొంత ఇంట్లో కూడా స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది.

ఇక సొంత సోదరులే, కన్న తండ్రే అఘాయిత్యాలకు పాల్పడి దారుణాలు చేసిన సందర్భాల గురించి మీరు వినే ఉంటారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తన కుమారుడి భార్య అన్న కనికరం లేకుండా, కోడలు కూతురు లాంటిదన్న కనీస విచక్షణ లేకుండా ఓ వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోడలు ఎంతగా ప్రతిఘటించినా, ఆ మామ పశుబలం ముందు ఆమె గెలవలేకపోయింది. ఈ దారుణ ఘటన నుంచి తేరుకున్న తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఓ లాడ్జిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వ్యాపార నిమిత్తం ఢిల్లీ నుంచి 21 ఏళ్ల కోడలు తన మామతో కలిసి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. హబీబ్ నగర్ లోని సుభాన్ బేకరీకి దగ్గరలో ఓ లాడ్జిలో తాత్కాలికంగా ఉండేందుకు ఆ మామా కోడళ్లు రెండు రూమ్స్ తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్త్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఢిల్లీలో కస్టమర్లకు అమ్మడమే వారి వ్యాపారం.

ఇక బుధవారం రాత్రి లాడ్జిలో తన గదిలో ఉండగా మామ వచ్చాడు. మామయ్యే కదా అని లోపలికి రానివ్వడమే ఆమె చేసిన పొరపాటయింది. లోపలికి వచ్చిన వెంటనే ఆ మామ ఆమెపై బలాత్కారానికి యత్నించాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన నుంచి తేరుకున్న ఆమె గురువారం హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మామపై కేసు పెట్టింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: