బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు.  టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటిమీదకు రావాలంటోన్న బండి సంజయ్... రాజకీయ స్వార్థం కోసమే పీవీని కేసీఆర్ వాడుకుంటున్నాడని విమర్శలు చేసారు. మోసం చేయటంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే.. కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు. మరణించినప్పుడు ఢిల్లీలో పీవీకి అన్యాయం జరిగితే కేంద్రమంత్రిగా ఉండి కేసీఆర్ చేసిదేంటి?  అని నిలదీశారు. పీపీ కూతురుకు రాజ్యసభకు నామినేట్ ఎందుకు చేయలేదు?  అని ఆయన ప్రశ్నించారు.

పీవీ ఘాట్ ను కూల్చుతామంటే ఎంఐఎంను హెచ్చరించింది బీజేపీ. కేసీఆర్ కనీసం స్పందించలేదు అని మండిపడ్డారు. పీవీకి కనీసం నివాళులర్పించని చరిత్ర కేసీఆర్ ది అని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుకు, జిల్లాకు పీవీ పేరు పెడ్తానని కేసీఆర్ మాట తప్పాడు అని మండిపడ్డారు. వామనరావు హత్యపై సీబీఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేసారు. కేసీఆర్ కుటుంబం పీవీ కవచాన్ని  కప్పుకుని డ్రామాలాడుతోంది అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసి పొరపాటు చేయొద్దని మేధావి వర్గాన్ని కోరుతున్నాను అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే.‌. కేసీఆర్  మళ్ళీ విర్రవీగుతాడు అని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోన్న బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది అని మండిపడ్డారు. కపిలవాయి దిలీప్ కుమార్ కు కాషాయ కండువా కప్పటాన్ని గర్వంగా ఫీలవుతున్నాను అన్నారు. కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయాన్ని త్వరలో బయటపెట్టబోతున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీగా కేసీఆర్ పార్లమెంటు ను తప్పుదోవ పట్టించాడు అని, పార్లమెంటును తప్పుదారి పట్టించిన ఆధారాలు నాదగ్గరున్నాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ కు సంబంధించిన వ్యవహారం కాబట్టి స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాను అన్నారు. కేంద్రపార్టీ అనుమతితో కేసీఆర్ బండారం బయట పెడ్తాను అని, ముమ్మాటికి పార్లమెంటును కుదిపేసే అంశమవుతోంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: