సీఎం కేసీఆర్ చుట్టూ ఈడీ నిఘా పెట్టిందని..ఏ క్షణమైనా రైడ్స్ జరగవచ్చని అన్నారు మాజీ ఎమ్మెల్సి కాపీలవాయి దిలీప్ కుమార్. ఆయన బండి సంజయ్ తో మీటింగ్ అనంతరం తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. అనంతరం దిలీప్ కుమార్ మీడియా తో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా దిలీప్ మాట్లాడుతూ...బండి సంజయ్ తన ఆఫీసుకు వచ్చి నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవాలని కోరడం తో విత్ డ్రా చేసుకుని బీజేపీ లో చేరినట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ కుటిల రాజకీయ వేత్త అని దిలీప్ అన్నారు. కేసీఆర్ ఎలాంటి గేమ్స్ అడుతారో ఎలాంటి రాజకీయ అవగాహన లేని వాళ్లకు అయినా తెలుసునని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ను తాను, కేసీఆర్ ఢిల్లీలో కలిసామని దిలీప్ అన్నారు. అప్పుడు పీవీని కేసీఆర్ సమైక్య వాది అని వ్యాఖ్యానించారని గుర్తు చేసారు. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు పీవీ  గుర్తుకు రావడం రాజకీయమేనని అన్నారు.

పీవీ కుమార్తె వాని కి ఎమ్ఎమ్ఎల్సీ టికెట్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ కుల పంచాయతీ పెడుతున్నారని అన్నారు. బ్రాహ్మణ ఓట్లు దండుకోవడానికే కేసీఆర్ ఈ ప్లాన్ వేశారని అన్నారు. కేసీఆర్ కు ఏనాడు పీవీ పై ప్రేమ లేదని...ఈ ఎన్నికల్లో పీవీ కుమార్తె వాణి బలి పశువు అవ్వబోతుందని వ్యాఖ్యానించారు. సీఎం చెప్పేదంతా అర చేతులో స్వర్గమేనని దిలీప్ అన్నారు. అందర్నీ మోసం చెయ్యడానికే పీవీ కుమార్తెకు టికెట్ ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించే అవకాశం ఎవరికి వచ్చినా వాదులుకోవద్దని వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ లు కేసీఆర్ మాటలకు లొంగవద్దని అపీల్ చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సంపాదన ముకేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కన్నా ఎక్కువ అని అన్నారు. ఆ డబ్బుల జాబితాను ఈడీ రెడీగా పెట్టుకుందని..త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కోపలిపోతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: