ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఉరుకుల పరుగుల జీవితం లో ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ గానే గడుపు తున్నారు. కానీ ఇప్పటికి కూడా మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గటం లేదు.  అధునాతన నాగరికతలో కూడా మహిళలు ప్రశ్నార్థక జీవితాన్ని గడపాలని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజు రోజుకు మహిళలు  కామాంధులు బారిన పడుతూనే ఉన్నారు. కామంతో ఊగిపోతున్న మానవ మృగాలు ఆడపిల్ల కనిపిస్తేచాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.



 వెరసి ఈ సృష్టికి మూలమైన ఆడపిల్ల ప్రతి క్షణం ప్రతి రోజు అడుగడుగునా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కామాంధులు బారినపడి జీవితం బలవుతుందో అని  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూన్నాయి  న్యాయస్థానాలు.  ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అత్యాచారం కేసులో నిందితుడైన బాధితురాలికి  ఇచ్చి పెళ్లి చేసారు. ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది.



 ఒడిశాకు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఇటీవలే ఓ బాలికపై అత్యాచారం చేయగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.  ప్రస్తుతం అతను కొన్ని రోజుల నుండి  జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అతను బెయిల్ కోసం అర్జీ  పెట్టుకోగా అత్యాచారం చేసిన బాధితురాలిని పెళ్లి చేసుకుంటేనే బెయిల్ మంజూరు చేస్తామని పొక్సో  కోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ మధ్యనే 18 ఏళ్లు నిండిన ఆ బాధితురాలికి పోలీసులు లాయర్ల మధ్య జైల్లోనే పెళ్లి జరిపించారు.  కాగా ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: