అయితే సోషల్ మీడియా వాడకం పెరగడం ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఫేక్ న్యూస్ లు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏది నిజమైన వార్త.. ఏది ఫేక్ న్యూస్ అని తెలియక ప్రజలు అందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. అయోమయంలో పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికల్లో ముందుగా ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసిన వ్యక్తిఎవరు అనేది గుర్తించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం.
ఈ క్రమంలోనే డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరుతో కేంద్రం కొత్తగా నిబంధనలు తీసుకువచ్చింది. అయితే ఈ నిబంధనలు ప్రస్తుతం భారతదేశంలో అతి ఎక్కువగా వాడుకలో ఉన్న వాట్సాప్ కి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రూల్స్ ప్రకారం ఫేక్ మెసేజ్లు మొదట ఎక్కడ నుంచి ఫార్వర్డ్ అయ్యాయి అన్నది ఆయా సోషల్ మీడియా వేదికలు .. కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇలాగే ఒక మెసేజ్ మూలాలను కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ ని అడిగినప్పుడు ఆ వివరాలను వెల్లడించేందుకు వాట్సాప్ అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త రూల్స్ పాటించకపోతే వాట్సప్ సహా ఇతర మెసేజింగ్ యాప్ లకు కూడా ఇబ్బందులు తప్పే అవకాశం లేదు అన్నది తెలుస్తుంది.