శ్రీవారిని నిర్మాత అంబికాకృష్ణ కూడా దర్శించుకున్నారు. శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు కలిగిన భక్తులకు టీటీడి సరైన దర్శనం కల్పించడం లేదు అని ఆయన ఆరోపించారు. రాను...రాను...శ్రీవాణి ట్రస్టు భక్తులకు కల్పించే దర్శనం స్వదర్శనం లాగా వుంటావుంది అని ఆరోపించారు. 10వేల రుపాయలు ఇచ్చి టిక్కెట్టు కొనుగోలు చేసే భక్తులకు కల్పించే దర్శనం పై టీటీడి పునరాలోచించాలి అని ఆయన సూచించారు. టిక్కెట్ల సంఖ్యను తగ్గించైనా గతంలో కల్పించిన విధంగానే శ్రీవాణి ట్రస్టు భక్తులకు టీటీడి దర్శనం కల్పించాలి అని కోరారు.
శ్రీవారిని రాజమండ్రి ఎంపి భరత్ కూడా దర్శించుకున్నారు. టీటీడి పాలకమండలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ తీర్మానం చేస్తావుంది అని తెలిపారు. టీటీడి తీర్మానం మేరకు వైసిపి తరుపున గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని లోకసభలో కేంద్రాని డిమాండ్ చేస్తాం అన్నారు. ప్రజలు సంక్షేమానికే పట్టం కడుతున్నారు అని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే మున్సిపల్,స్ధానిక ఎన్నికల్లో పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేసారు. బిజెపికి పూర్తి మెజారీటి వున్నా ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై జగన్ ఒత్తడి తెస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా బతికే ఉంది అంటే అది జగన్ వల్లే అని అయన అన్నారు. హోదా పై బాబు ఎన్నో యూటర్ప్ లు తీసుకున్నారు అని మండిపడ్డారు. శ్రీవారిని ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్, కృత్తిశెట్టి,దర్శకుడు బుజ్జి బాబు దర్శించుకున్నారు.