జూన్ 2019 లో పోస్కో తో సమావేశమై , జులై 2019 లో సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోసల్ అందజేశారు అని ఆయన వెల్లడించారు. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అయ్యారు అని అన్నారు. అక్టోబర్ లో ఎం ఓ యూ చేసుకున్నారు అని అన్నారు. సంవత్సరం క్రిందట ముఖ్యమంత్రి కి సమాచారం తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు అని నిలదీశారు. వైసీపీ ఎంపీ లు ఎందుకు పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ విషయం లెవనెత్తలేదు అని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్రతి ప్రధాన ఘట్టానికి ముందు వెనుక ముఖ్యమంత్రి జగన్ తో,విజయసాయిరెడ్డి తో పొస్కి ప్రతినిధులు సమావేశం అయ్యారు అని ఆయన అన్నారు.
ఈ విషయాలు పై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఆర్ ఐ ఎన్ ఎల్ కోసం చంద్రబాబు కష్టబడ్డారు అని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రస్తావించలేదు అని నిలదీశారు. చంద్రబాబు అబివృద్ది చేసిన అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చెయ్యాలి అని చూస్తుంది అని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ను పోస్కో కు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని అన్నారు.