మహిళల పై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల కఠిన చర్యలను తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇంట్లోనూ, బయట రక్షణ లేకుండా పోయింది. బయటకు వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నారు.ముఖ్యంగా ఒంటరిగా తిరగాలంటే కూడా భయంతో పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. నార్త్ సైడ్ ఎక్కువగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా కూడా ఆ ప్రభుత్వాలు ఏదో నామ మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.. దాంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు..


ఇప్పుడు జరిగిన ఓ సంఘటన మనుషులను కంట తడి పెట్టిస్తుంది. లిఫ్ట్ అడిగిన పాపానికి ప్రాణాలను తీశారు. అతి దారుణంగా అత్యాచారం చేసి మరీ నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ మహిళ పై తండ్రీ కుమారుడు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించి పారి పోయారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ సీతాపూర్ జిల్లా లోని మిశ్రిక్ ఏరియాలో గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 30 ఏండ్ల వయసున్న మహిళ తన అత్తగారిల్లు సిధౌలి నుంచి మిశ్రిక్ వెళ్తుండ గా, దారి మధ్య లో కార్ట్ ఫుల్లర్‌ పై వెళ్తున్న తండ్రీ కుమారుడిని లిఫ్ట్ అడిగింది.


ఆమెను బండి ఎక్కించుకున్న వారిద్దరూ నిర్మానుష్య ప్రదేశం లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అంతటి తో ఆగకుండా ఆమెకు నిప్పంటించారు. తీవ్ర గాయాల తో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు చేరదీసి పోలీసుల కు సమాచారం అందించారు. బాధితురాలు సీతాపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు... మహిళ పై అత్యాచారం చేసిన తండ్రి(55)తో పాటు కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.. ఆమె మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన పై ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: