పెరుగుని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అయితే చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు. నిజానికి పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. కానీ.. పెరుగుని ప్రతిరోజూ పెరుగును ఆహారంలో తీసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పెరుగు తినడం వలన పలు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినడం వల్ల ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయి. రోజు పెరుగుతినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి..

అంతేకాదు.. రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది. పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని బి, టి వంటి తెల్ల రక్తకణాలను పెరిగేలా ఛేస్తుంది. పెరుగు శరీరానికి కావల్సిన విటమిన్ కె అందిస్తుంది. పెరుగు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పొందవచ్చు.

ఇక పెరుగులో ఉండే విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, ఇతర మైక్రో మినిరల్స్ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా ఉండెలా చేస్తుంది. పెరుగులో ఉండే క్యాల్షియం ఫాస్పరస్ ఎముకలకు దంతాలను బలంగా ఉంచుతుంది.  పెరుగు తినని వారితో పోల్చుకుంటే తినేవారు కూల్ గా ఉంటారని, టెన్షన్ కు దూరంగా ఉండటమే కాకుండా ప్రశాంతంగా ఉంటారని బోస్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: