తమిళనాడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలిసినదే. విజయం ఎంతవరకు దక్కుతుంది ఏమిటనేది తెలియదు. కానీ అక్కడ ఉన్న సినీ నటులు ద్వారా రాజకీయం చేయడానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే బీజేపీ నేతలు కొంతమంది సినీ నటులు తో సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. కొంతమంది సినీ నటులు తమ పార్టీలోకి వస్తే వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని కూడా చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం లోకి కూడా తీసుకుంటామని చెప్తున్నారట. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తామని కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తామని కూడా ఒక అగ్ర హీరోకి హామీ ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్రోల్ ధరల విషయంలో అక్కడి ప్రతిపక్షాలు కాస్త గట్టిగానే పోరాటం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మరింత స్పీడ్ గా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.

అందుకే భారతీయ జనతాపార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక అగ్ర హీరోతో ఇప్పటికే చర్చలు జరపటమే కాకుండా ఆయనను ఒప్పించారని సమాచారం. అయితే ఎన్నికలు ఇంకా నెల రోజులు ఉన్నాయి అనగా ఆయన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడే క్రమంలో తమిళనాడు మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో బలంగానే ఉన్నా ఆ పార్టీ తమిళనాడులో ఎలాగైనా సరే తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: