తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే దాసోజు శ్రవన్ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం గమనార్హం. . కేటీఆర్ చెప్పిన అంకెలపై చర్చకు రావాలని కాంగ్రెస్ నేత శ్రవణ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసరడంపై తలసాని ఘాటుగా స్పందించారు.మంత్రి కేటీఆర్కు సవాల్ చేసే స్థాయి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కు లేదని అన్నారు. ఉద్యోగాల లెక్కలపై కేటీఆర్ను శ్రవణ్ నిలదీయడంపై మండిపడ్డారు. ‘‘నిన్న ఓ గొట్టంగాడు గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని.. నేను ఇక్కడున్నాను.. ఉద్యోగాలపై స్పష్టత ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ రావాలె అంటూ మాట్లాడిండు.
మంత్రి రావాలంటే.. వస్తడా? అతనిది కేటీఆర్కు సవాల్ విసిరేటంత స్థాయి కాదు. అలాంటి వాళ్లకు మేం సమాధానాలు చెప్పం” అని తలసాని కామెంట్ చేశారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా ‘‘తలసాని బుద్ధిలేని సన్నాసి. తెలంగాణ ఉద్యమానికి తలలేని శ్రీనివాస్కు ఏం సంబంధం. ఆ ఆకు రౌడీ ఆలుగడ్డల శ్రీనివాస్ యాదవ్తో తిట్టించటం కేటీఆర్ కు తగదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ బిచ్చగాడు తలసాని. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడితే గొట్టంగాళ్లంటూ కామెంట్లు చేస్తరా? ఈ గొట్టంగాళ్లే మీకు కర్రుకాల్చి వాత పెడ్తరు” అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు.