తాజాగా ఆయన దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనలో అధికార పార్టీకి అభ్యర్థులు లేరు అనే అంశాన్ని ఆయన ప్రధానంగా హైలెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక టిడిపి అభ్యర్థులని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారు అని ఆయన ఆరోపించారు. పలాస, రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ కు తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయం అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం అని ఎద్దేవా చేసారు. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు అని ఆయన ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టిడిపి అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. నువ్వొక నాయకుడివి నీదొక పార్టీ... అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ అంటూ ఆయన ఆరోపించారు.