దేశంలో ఉగ్రవాద శక్తులు కలిగిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే భారతీయ సంపన్నుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీపై దాడి చేయటానికి ఒక ఉగ్రవాద సంస్థ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెపుతుంది. అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుంది “జైషుల్ హింద్” అనే ఉగ్రవాద సంస్థ. గత గురువారం ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు ఉంచింది తామేనని ఆ సంస్థ ప్రకటించుకుంది. ఇది కేవలం ట్రైలరే అని, తాము అడిగింది ఇవ్వకపోతే ముందు ముందు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక చేసింది టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆ సంస్థ సందేశం పంపించింది.
మీకు చేతనైతే మమ్మల్ని ఆపండి అంటూ విచారణ సంస్థలకు సవాలు కూడా విసిరింది. ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లు ఆంటిలియా ముందు గత గురువారం స్కార్పియో కారులో 20 జిలిటెన్ స్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడు పదార్థాలతో పాటు అందులో కొన్ని కార్ల నంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. వాటిలో అంబానీ భద్రతా సిబ్బంది వినియోగించే కార్లకు సంబంధించిన నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. బిట్కాయిన్ రూపంలో తమకు డబ్బు చెల్లించాలని “జైషుల్ హింద్” డిమాండ్ చేసింది. మీరు (అంబానీలు) ఏం చేయాలో మీకు తెలుసు. మేము ఇంతకు ముందు అడిగిన డబ్బును చెల్లించండి అని ఆ టెలిగ్రామ్ మెసేజ్ లో జైషుల్ హింద్ స్పష్టం చేసింది. ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలను హెచ్చరిస్తూ రాసిన లేఖ కూడా ఆ స్కార్పియో వాహనం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంటి ముందు ఇలా స్కార్పియోలో పేలుడు పదార్థాలు ఉంచడం అన్నది కేవలం ట్రైలరే అని ఆ లేఖలో జైషుల్ హింద్ హెచ్చరించింది. కొన్ని రోజుల కిందట ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర పేలుడుకు కూడా తామే బాధ్యులమని జైషుల్ హింద్ ప్రకటించుకుంది. మీరు మొసాద్ (ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) తో కలిసినా ఏమీ చేయలేకపోయారు అని ఆ సందేశంలో ఆ సంస్థ చెప్పింది.