సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశ వంటి చట్టాలు తెచ్చి కఠిన శిక్షలు విధిస్తున్నా ఈ ఘోరమయిన అఘాయిత్యాలకు ఆగటం లేదు. తాజాగా 22 ఏళ్ల యువతి పై ఓ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ హోటల్ కు తీసుకెళ్లి మరీ ఆమె పై లైంగిక దాడికి దిగాడు. జరిగిన సంఘటన నుంచి తేరుకున్న యువతి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి,వెంటనే అతడి పై తగిన  చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో 22 ఏళ్ల యువతి ఉండగా అక్కడకు 28 ఏళ్ల ఓ యువకుడు వచ్చాడు. అతడు ముంబైలోని ఓ బడా వ్యాపారవేత్త కొడుకు, ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ లో యాంకర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆ యువతికి, ఆ యాంకర్ కు మూడేళ్లుగా పరిచయం ఉంది. తెలిసిన వ్యక్తే  కావడంతో పిలిచిన వెంటనే ఆమె అతని దగ్గరకు వెళ్లింది. తన కుటుంబ సభ్యులు దగ్గరలోని హోటల్ లో ఉన్నారనీ, పరిచయం చేస్తానని చెప్పి ఆమెను అక్కడికి  తీసుకెళ్లాడు.

అయితే ఢిల్లీలోని చక్రాయపురిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు ఆ యువతిని  తీసుకెళ్లాడు. అయితే ఆమెను అతడి కుటుంబ సభ్యులు ఉన్న గదికి కాకుండా, వేరే ప్రత్యేక గదికి తీసుకెళ్లాడు.  కొద్దిసేపు ఫ్రెషప్ అయ్యాక వెళ్దామని చెప్పాడు. ఆ తర్వాత ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతి ఘటిస్తున్నా అఘాయిత్యం చేశాడు. జరిగిన సంఘటన నుంచి తేరుకున్న యువతి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ యాంకర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం నాడు  వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామనీ, ఆధారాలు సేకరించి అతడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: