కరోనా నుంచి జే అండ్ జే టీకా సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుందని ఎఫ్డీఏ తెలిపింది. మూడు వేర్వేరు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశామన్న ఎప్డీఏ.. తీవ్రత ఎక్కువగా ఉన్న కొవిడ్-19 కేసుల్లోనూ ఈ టీకా 85శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. మార్పులు కరోనా వైరస్ల్లో దక్షిణాఫ్రికా రకంపై కూడా దీని ప్రభావం ఆశాజనకంగా ఉంది. కరోనా వైరస్ నిరోధానికి ఇతర టీకాలు రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కేవలం ఒక డోసుతోనే ఈ టీకా ఆస్థాయిలో పనిచేయడం విశేషం' అని ఎఫ్డీఏ పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ స్పందించాడు. 'అధిక రక్షణ సామర్థ్యం కలిగిన టీకాలనే మేం వాడుకలోకి తెస్తున్నాం'అని తెలిపారు.
ఈ టీకా నేటి నుంచి పలు రాష్ట్రాలకు సరఫరా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, అమెరికాలో మార్చి చివరి నాటికి 2కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని జే అండ్ జే సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ సంస్థ ఇప్పటికే యూరప్లోనూ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకొంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డోసుల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టీకా తొలిసారిగా గురువారం నాడు బహ్రైన్లో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. అమెరికాలో ఇప్పటికే ఫైజర్-బయో ఎన్టెక్, మోడెర్నా టీకాలు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి కరోనా అంతు చూసేందుకు పలు దేశాలు ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ కరోనా మాత్రం కొన్ని దేశాల్లో విస్తరించుంటూ పోతోంది.