కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలావత్వరగా వ్యాపిస్తుంది.. మొదటి సారి వచ్చిన దానికన్నా అంతమించి వేగం పుంజుకుంది. మిగిలిన వాటితో పోలిస్తే పెళ్లిళ్లకు మళ్లీ బ్రేక్ పడింది. కేవలం 50 మందితో చేసుకోవాలని నిబంధన కాస్త ఇపుడు 30 కి తగ్గిందని తెలుస్తుంది. విషయానికొస్తే.. కేరళలో కరోనా విపరీతంగా పెరుగుతుంది. అదే ఓ సాధారణ జీవితాన్ని చిన్నా భిన్నం చేసింది. కేరళ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు చూపించాలి, లేదంటే వారిని వెనక్కి పంపిస్తారు. ఈ నిబంధనలు కాబోయే దంపతులకు చుక్కలు చూపిస్తున్నాయి.


వధువు కర్ణాటక, వరుడు కేరళ, వివాహం కొడగు జిల్లా మడికేరిలో అయితే, వరుడు సహా వందలాది మంది బంధుమిత్రులు కరోనా నెగిటివ్‌ రిపోర్టు చూపించడం సాధ్యమేనా అని కేరళీయులు నిట్టూరుస్తున్నారు.. కేరళ, మహారాష్ట్రలో కరోనా మళ్లీ  పుంజుకుంది.అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కరోనా నెగిటివ్ రిపోర్ట్ చుపిస్తినే కర్ణాటకలోని ఎంట్రీ లేకుంటే ఎంత పెద్ద పెళ్లి అయిన ఆగిపోవాల్సిందే..కొడగు జిల్లా మడికేరిలోని కడగదాళు గ్రామానికి చెందిన సుమతి అనే అమ్మాయి పెళ్లి కేరళలోని కాసరగోడు జిల్లాకు చెందిన ప్రమోద్‌ నాయర్‌తో నిశ్చయమైంది.


మడికెరిలోని ఓంకారేశ్వర దేవాలయంలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికొడుకు బృందంవారు కరోనా నెగిటివ్‌ రిపోర్టు తీసుకురావాల్సి రావడంతో సమస్య వచ్చి పడింది. అంతమందీ కరోనా పరీక్షలు జరిపించాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఒకవేళ చేసిన 72 గంటల తర్వాత నే రిపోర్ట్ వస్తుంది.సోమవారం వివాహం నాటికి కరోనా పరీక్షల ఫలితాలు రావడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులే హాజరైతే 10-15 మంది ఉంటారని, వారికి ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయిస్తే కనీసం రూ. 25 వేలైనా ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీనాలీ చేసి కూతురు పెళ్లి చేస్తున్న తమలాంటి సామాన్యులకు అంతటి భారం మోయడం కుదరని చెప్పారు.. ఇలాంటి ఘటనలు కేరళ మహారాష్ట్రలలో ఎన్నో జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: