ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియుడు తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు అనే వార్త విన్న ప్రియురాలు ఇక జీర్ణించుకోలేక పోయింది. తన జీవితం వృధా అనుకుని.. విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది యువతి. ఈ ఘటన ఒడిషాలోని చోటు చేసుకుంది. సోమన్న సాసనం గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన గోపాల్ బెహరా తో రిలేషన్ షిప్ లో ఉంది.
కొంతకాలం వరకు వీరి బంధం బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో అపార్ధాలు చోటుచేసుకున్నాయి. గతంలో గోపాల్ సదరు మహిళపై అత్యాచారం చేశాడు అంటూ మహిళ కుటుంబ సభ్యులు గోపాల్ పై దాడి చేశారు. అయితే ఇటీవల గోపాల్ వేరే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇక ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న విషం తాగింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు యువతిని సమీప ఆసుపత్రికి తరలించి.. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.