ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది కదా.. అయితే స్టోరీ లోకి వెళ్దాం.. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ కు చెందిన ఆంటోని, రే విలియమ్స్ ఇద్దరు కూడా స్వలింగసంపర్కులు. అయితే ఈ ఇద్దరుగే దంపతులు ఎంతో కాలంగా ఒక బిడ్డ కావాలి అని అనుకుంటున్నారు. సరోగసీ ద్వారా బిడ్డను పొందాలని భావిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే బిడ్డను కనాలి అనే కోరిక తీరదేమో అని ఈ దంపతులు ఆందోళనలో మునిగిపోయారు. ఇంతలో దేవుడు వరం ఇచ్చిన ట్లుగా ఆంటోని సోదరి విషయం తెలిసి సోదరున్ని కలవడానికి వచ్చింది.
ఈ క్రమంలోనే సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డను కని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి ఆమె భర్త అడ్డు చెప్పాడు. ఎందుకంటే ఆమె వయస్సు అప్పటికీ 40 ఏళ్ళు దాటడం.. ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉండడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ తమ్ముడి కోరిక తీర్చాలని గట్టిగా ఫిక్స్ అయిన అక్క.. సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధమైంది. అయితే ఇద్దరూ వీర్యాన్ని దానం చేసినప్పటికీ పుట్టబోయే బిడ్డకు బయోలాజికల్ గా ఎవరి బిడ్డ అనే విషయం తెలుసుకో కూడదని డిసైడ్ అయ్యారు. తర్వాత మహిళా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తమ కోరిక తీర్చడానికి తన సోదరి చేసిన సహాయం మరువలేనిది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు ఆంటోని.