దేశీయ ఫార్మాదిగ్గజం హైదారాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా ను ధరించి మోడీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోడీ గమ్చా ను ధరించారు
తాను కరోనా తొలి డోసు టీకా తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కొవిడ్కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ మొదలైంది. తొలి దశలో ప్రభుత్వ ఆస్పత్రికి సిబ్బందికి టీకా వేశారు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బందికి ఇచ్చారు. దాంతో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న పోలీసులు, శానిటేషన్ సిబ్బందికి కూడా కొవిడ్ టీకా పంపిణి చేశారు. మార్చి 1 నుంచి 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు , 35 ఏండ్లకు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.