తొలిసినిమాతోనే భారీ హిట్టు అందుకున్నాడు యువ హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఉప్పెన ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోంద‌నే చెప్పాలి.  ఈసినిమాలో వైష్ణ‌వ్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా భారీ చిత్రాల మాదిరిగా దూసుకెళ్తుండ‌టం విశేషం.సుకుమార్ చెప్పిన విధంగా రూ.100 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటేసి లాభాల్లోకి వెళ్లింది ‘ఉప్పెన’. అంతేకాదు, మూడో రోజు కలెక్షన్స్ విషయంలో భారీ చిత్రాల సరసన నిలిచింది.తొలి మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా రూ.28.29 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్‌ (రూ. 22.5 కోట్లు)ను దాటేసి లాభాలు కూడా అందుకుంది ‘ఉప్పెన’. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 24.97 కోట్లు వసూలు చేసి స‌త్తా చాటింది.


 ఈ విష‌యం ఇలా ఉండ‌గా వైష్ణ‌వ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల కంట్లో మెరుస్తానుండానే చెప్పాలి. ఒక‌రిద్ద‌రూ క‌థ‌లు కూడా విన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ యువ హీరో సినిమాకు సంబంధించిన‌ న్యూ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఉప్పెనతోనే టాలీవుడ్‌కి బ్యూటీ కృతి శెట్టి కూడా పరిచయం అయ్యారు. ప్రస్తుతం తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వైష్ణవ్ తన రెండో సినిమాని స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న‌ట్లుగా టాలీవుడ్ స‌మాచారం.  ఈ సినిమా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన పుస్తకం ‘కొండపొలం’ ఆధారంగా తెర‌కెక్క‌నుంది.  మొదటగా ఈ సినిమాకి కూడా కొండపొలం పేరునే ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ ‘జంగిల్ బుక్’ టైటిల్‌ను పున‌రాలోచ‌న చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.  అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


క్రిష్  ప‌వ‌ర్‌స్టార్ సినిమాతో బిజిగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మొఘ‌లుల కాలం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ఇంత‌వ‌ర‌కు ఎప్పుడూ క‌నిపించ‌ని లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ప‌వ‌న్ లుక్ కూడా ఒక‌టి లీక్ కాగా.. ఆయ‌న అభిమానుల‌ను అది తెగ ఆక‌ట్టుకుంటోంది. ప‌వ‌ర్ స్టార్ సినిమా త‌ర్వాతే వైష్ణ‌వ్ సినిమా మొద‌లు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: