ఈ విషయం ఇలా ఉండగా వైష్ణవ్ ప్రముఖ దర్శకుల కంట్లో మెరుస్తానుండానే చెప్పాలి. ఒకరిద్దరూ కథలు కూడా విన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ యువ హీరో సినిమాకు సంబంధించిన న్యూ అప్డేట్ వచ్చేసింది. ఉప్పెనతోనే టాలీవుడ్కి బ్యూటీ కృతి శెట్టి కూడా పరిచయం అయ్యారు. ప్రస్తుతం తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వైష్ణవ్ తన రెండో సినిమాని స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నట్లుగా టాలీవుడ్ సమాచారం. ఈ సినిమా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన పుస్తకం ‘కొండపొలం’ ఆధారంగా తెరకెక్కనుంది. మొదటగా ఈ సినిమాకి కూడా కొండపొలం పేరునే ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ ‘జంగిల్ బుక్’ టైటిల్ను పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
క్రిష్ పవర్స్టార్ సినిమాతో బిజిగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఇంతవరకు ఎప్పుడూ కనిపించని లుక్లో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి పవన్ లుక్ కూడా ఒకటి లీక్ కాగా.. ఆయన అభిమానులను అది తెగ ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్ సినిమా తర్వాతే వైష్ణవ్ సినిమా మొదలు కానుంది.