నేటి రోజుల్లో మానవ బంధాలకు విలువ ఇవ్వని మనుషులు క్షణకాల సుఖం కోసం ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి.  కాపురాలు కూలి పోవడానికి కారణం అవుతున్నాయి.  అంతేకాదు ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కూడా అక్రమ సంబంధాలు దారి తీస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయినప్పటికీ ఎవరి లో మాత్రం మార్పు రావడం లేదు. క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలకు తెర లేపుతూ చివరికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు అనుమానాస్పద మృతి కలకలం రేపింది.  ఏలూరు తంగేళ్లమూడి కి చెందిన యువతికి  2014లో నిడదవోలు మండలం తాళ్ల పాలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.  అయితే సదరు మహిళకు అంతకుముందే ఏలూరు గన్  బజార్ కు చెందిన మరో వ్యక్తితో సంబంధం ఉంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడిని వదులుకోలేక పోయింది ఆ మహిళ.  ఈ క్రమంలోనే భర్తకు తెలియకుండా ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.


 ఇక అప్పుడప్పుడు భర్తకు ఏదో ఒక కారణం చెప్పి ప్రియుడిని కలిసి వెళ్ళేది సదరు మహిళ. ఇక ఇటీవలే ఇలాగే తాళ్ల పాలానికి ప్రియుడిని కలిసేందుకు వచ్చింది.  ఇద్దరు కలిసి ఒకే గదిలో కి ఉండగా.. బంధువులు గమనించి వారిని గదిలో బంధించారు. ఇక భర్తకు విషయం తెలియడంతో.. స్థానికులను తీసుకొని ఆ గది వద్దకు వెళ్ళాడు.  కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి ఊహించని ఘటన చోటుచేసుకుంది. గదిలో అపస్మారక స్థితిలో మహిళ పడి ఉండగా ఆమెను వెంటనేప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది ఇక అదే గదిలో భార్య ప్రియుడు కూడా చనిపోయి ఉండడం గమనార్హం. అయితే వీరిద్దరూ భయంతో ఎలకల మందు తాగారా లేకపోతే ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: