పిల్లలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. వాళ్ళు చేసే ముద్దు పనులు కోపాన్ని తెప్పించిన తరవాత పెద్దలపైకి చిరునవ్వునే తెస్తాయి. ఇంట్లో పిల్లలు చేసే అల్లరి అంత ఇంతాకాదు. చిన్న పిల్లలు వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దు మాటలను విని తల్లిదండ్రులు చాల సంతోష పడుతుంటారు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే బాలుడి పట్ల క్రూరంగా వ్యవహరించారు. అయితే బాలుడు పక్క తడుపుతున్నాడనే కారణంతో పైశాచికంగా ప్రవర్తించారు ఆ దుర్మార్గులు. ఇలా చేసిన ఓ వ్యక్తి, అతని రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానే‌లో చోటుచేసుకుంది. బాలుడి బయోలాజికల్ తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యకి మధ్య మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. వీరిద్దరికి ఒక్క బాలుడు కూడా ఉన్నాడు. అతడు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకును(9) తన వద్దే ఉంచుకున్నాడు. తన కొడుకు ఆలనా పాలనా చూసుకోవడానికి అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలోనే అతడు తన రెండో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే రోజు రాత్రి సమయంలో ఆ బాలుడు బెడ్‌ పై మూత్రం పోస్తున్నాడని ఆగ్ర‌హం తెచ్చకున్నారు.

అయితే తెలిసి తెలియక చేసిన తప్పుకు అతన్ని దారుణంగా కొట్టారు. బాలుడి మర్మాంగంపై వాతలు కూడా పెట్టి పశువుల్లా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి అసలు తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకుపై జరిగిన దాడి గురించి పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ మేరకు పీటీఐ వార్తసంస్థ వివరాలను వెల్లడించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: