ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యకి మధ్య మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. వీరిద్దరికి ఒక్క బాలుడు కూడా ఉన్నాడు. అతడు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకును(9) తన వద్దే ఉంచుకున్నాడు. తన కొడుకు ఆలనా పాలనా చూసుకోవడానికి అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలోనే అతడు తన రెండో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే రోజు రాత్రి సమయంలో ఆ బాలుడు బెడ్ పై మూత్రం పోస్తున్నాడని ఆగ్రహం తెచ్చకున్నారు.
అయితే తెలిసి తెలియక చేసిన తప్పుకు అతన్ని దారుణంగా కొట్టారు. బాలుడి మర్మాంగంపై వాతలు కూడా పెట్టి పశువుల్లా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి అసలు తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకుపై జరిగిన దాడి గురించి పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ మేరకు పీటీఐ వార్తసంస్థ వివరాలను వెల్లడించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.