కొవిడ్ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే చంద్రబాబు ఉండిపోయారు.అక్కడే నేలపై బైఠాయించి ఆయన నిరసనకు దిగారు. మరోవైపు తెదేపా శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని అందులో పేర్కొన్నారు.
చంద్ర బాబు చేపట్టిన చిత్తూరు పర్యటన మధ్యలోనే ఆగిపోయెలా ఉందని తెలుస్తోంది. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.ఇలా టీడీపీ నేతల పై పోలీసులు అధికారం చెలాయించడం తో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎక్కడ గెలుస్తామో అన్న భయంతో వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు. టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశం గా మారింది.