సాధారణంగా గురువులు అంటే పిల్లలకు మంచి చెడు బోధిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అనే విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం కొంతమంది ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉండటం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఏకంగా విద్యాబుద్ధులు నేర్పడం కాదు గురువులే స్వయంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చెడు దారులలో వెళుతున్న విద్యార్థులను మందలించి సక్రమ దారిలో నడిపించాల్సిన గురువు ఏకంగా ... విద్యార్థులకు చెడు అలవాట్లు నేర్పించాడు.
ఏకంగా విద్యార్థునులకు నీలిచిత్రాలు చూపిస్తూ కీచక ఆనందాన్ని పొందుతున్నాడు ఇక్కడ గురువు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థునుల పట్ల దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఏకంగా విద్యార్థునులకు నీలిచిత్రాలు చూపిస్తూ ఇబ్బందులకు గురి చేసే వాడు. ఇక రోజురోజుకు గురువు వేధింపులు ఎక్కువవడంతో ఇక ఓ రోజు ధైర్యం తెచ్చుకుని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఇక గ్రామస్తులు అందరూ కలిసి ఆ గురుకుల పాఠశాలలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న డీఈవో అక్కడికి చేరుకుని.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.