సినిమా నటీనటులు రాజకీయాల్లోకి వెళ్లడం సర్వ సాధారణ విషయం. కానీ రాజకీయనాయకులు సినిమాల్లోకి రావడం అనేది అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే వారున్న బిజీలో సినిమాల్లో నటించడం కష్టం. అయితే తెలంగాణకు చెందిన బీజేపీ నేత సినిమాల్లో నటించబోతున్నారు. 2018తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్.  భారతీయ జనతా పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్. ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే రాజా సింగ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

ఒక ఎమ్మెల్యేగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూనే.. ఒక గోరక్షకుడిగా గోవుల అక్రమ రవాణాపై తిరగబడుతున్నారు రాజా సింగ్. రియల్ లైఫ్ లో ఎన్నో పోరాటాలు చేసిన ఈయన ఇప్పుడు రీల్ లైఫ్ లోకి వస్తుండటం విశేషం.  శంభాజీ మహా రాజ్ జీవిత గాధ ఆధారంగా సినిమాను తీయనున్నారు. అందులో శంభాజీ పాత్రను పోషించబోతున్నాడు రాజా సింగ్. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని విశేషాలు చెబుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కుమారుడు శంభాజీ గురించి మాత్రం ఎవరికీ తెలియదని చెప్పారు. శివాజీ కంటే ప్రమాదకరమైన నాయకుడు. శివాజీ మరణించిన తర్వాత .. ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారని శంభాజీ. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలని.. అందులో నేనే నటించాలని అనుకున్నానని చెప్పాడు రాజా సింగ్.  

సినిమా కోసం తన బరువు 170 కేజీలు ఉంటే 90 కేజీలకు తగ్గినట్లు చెప్పాడు రాజా సింగ్. శంభాజీ పాత్ర కోసం.. అప్పట్లో ఆయన ఫిజిక్ ఎలా ఉండేదో అలాంటి బాడీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం 4 భాషల్లో సినిమా తీయనున్నట్లు చెప్పారు రాజా సింగ్. ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకుతున్నామని  చెప్పారు. నిర్మాత దొరికితే వెంటనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సినిమా తీసేంత ఆర్థిక స్థోమత తనకు లేదని.. ఒకవేళ ఉంటే తానే స్వయంగా శంభాజీ చిత్రాన్ని నిర్మించేవాడినని తెలిపారు. అందరి మాదిరి తన సినిమాలలో హీరోయిన్లతో పాటలు ఉండవని.. కామెడీ సన్నివేశాలు కనిపించవని.. కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు రాజా సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: