అయితే బైక్ స్పీడ్ గా నడపొద్దురా బాబూ.. అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు అన్నందుకు దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. ‘నన్ను మోటార్ సైకిల్ నడపొద్దంటారా? నేను ర్యాష్ డ్రైవింగ్ చేస్తే నీ కెందుకు? నీ రోడ్డా?’ అంటూ గొడవకు దిగడంతో పాటు ఏకంగా ఒకరిని కత్తితో పొడిచి చంపాడు. బైక్ స్పీడ్ గా నడపొద్దురా బాబూ.. అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు అన్నందుకు దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు.
ఇక మరొకరి మీద కత్తితో దాడి చేయగా అతడికి గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పీయూష్ శర్మ అలియాస్ కాకు అనే యువకుడు ఆదివారం రాత్రి మోటార్ సైకిల్ ర్యాష్గా నడుపుతూ వస్తున్నాడు. దీంతో అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు అంటూ సూరజ్, చందర్ అనే అన్నదమ్ములు వారించారు. ఈ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. కాకు వెంటనే తన ఫ్రెండ్స్ను పిలిచాడు. అందరూ కలసి సూరజ్, చందర్ మీద కత్తితో దాడి చేశారు. ఈ గొడవలో సూరజ్ ప్రాణాలు కోల్పోయాడు. చందర్కు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు చందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు పీయూష్ శర్మ (19), సందీప్ శర్మ (31), శివ నారాయణ (32) ల మీద కేసు నమోదు చేశారు.