కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఫుల్ హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో రాహుల్ పప్పు అంటూ అనేక సందర్భాల్లో వచ్చిన ట్రోల్స్ కు ఆయన పప్పు కాదు నిప్పు అని తెలిసేలా ఆన్సర్ ఇచ్చారు. ఏకంగా రాహుల్ సముద్రంలోనే  ఈత కొట్టి అందరికీ షాక్ ఇచ్చారు. సముద్రం చాలా మంది ఈత కొడుతుంటారు. కానీ రాహుల్ యాబై ఏళ్ళ వయస్సులో ఈత కొట్టడం అంటే మాములు విషయం కాదు. అంతే కాకుండా ఇటీవల సౌత్ పర్యటనలో ఆయన సిక్స్ ప్యాక్ లుక్ తోనూ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఆయన మరో సాహసం చేసి మళ్ళీ వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఓ పదిహేన్నేళ్ల అమ్మాయితో రాహుల్ పుషప్స్ పోటీకి దిగారు. ఆ పోటీలో అమ్మాయి డ్రాప్ అవ్వగా రాహుల్ గాంధీ మాత్రం అందరూ అవాక్కయ్యేలా పుషప్స్ చేశారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే .

అయితే ప్రచారం లో భాగంగా రాహుల్ అందరితో కలిసిపోతూ ప్రచారం లో దూసుకుపోతున్నారు. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ వారికి దగ్గరవుతున్నారు.  ఇక తాజాగా ఈరోజు ములంగు మూడు లో సెయింట్ జోసఫ్ స్కూల్ లో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సంధర్బంగా ఫిట్నెస్ ఛాలెంజ్ విసరగా రాహుల్ చురుకుగా పాల్గొన్నారు. మెరిన్ షోలిగో  అనే విద్యార్థిని పోటీగా దిగగా సింగిల్ హ్యాండ్ తో పుషప్స్ కొట్టేసాడు. అంతే కాకుండా విద్యార్థులతో కలిసి స్టెప్పులేసాడు. ఇలా రాహుల్ గాంధీ ఒక దాని తర్వాత ఒకటి చేస్తూ తనపై ఉన్న పప్పు అనే పేరు తుడిచిపెట్టేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ దేశంలో మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేదిశ‌గా అడుగులు వేస్తున్న‌రు. రాహుల్ గాంధీ స్పీడ్ పెంచ‌డంతో కాంగ్రెస్ కార్య‌క్త‌ల్లోనూ జోష్ పెరిగింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: