మొదట ప్రైవేట్ జాబ్ చేసుకునే గంగూళీ 2014లో నిర్జాష్ అనే పేరుతో ముకుంద్పూర్లో టీ స్టాల్ ప్రారంభించాడు. కానీ ఇక్కడ ఒక కప్పు టీ 1000 రూపాయలు. అవును మీరు విన్నది నిజమే..పశ్చిమ బెంగాల్లోని ఓ రోడ్డు పక్కన ఉంటుంది. కొల్కతాకు చెందిన పార్థ ప్రతీం గంగూళీ అనే వ్యక్తి తన టీ స్టాల్లో వందకు పైగా వెరైటీ టీలను విక్రయిస్తున్నాడు.వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట.
ఈ టీ స్టాల్ అక్కడ చాలా ఫేమస్ అయ్యింది. కేవలం ఈ రాష్టం వారు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల వారు కూడా ఇక్కడకు వచ్చి టీ తాగురంట. అయితే అంత రేటు పలికే ఈ టీ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.. మొదట ప్రైవేట్ జాబ్ చేసుకునే గంగూళీ 2014లో నిర్జాష్ అనే పేరుతో ముకుంద్పూర్లో టీ స్టాల్ ప్రారంభించాడు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లభించే 115 రకాల టీలు అందుబాటులో ఉంటాయి. కేజీకి రూ. 2.8 లక్షలు పలికే జపాన్ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ, రూ. 50వేలు నుంచి రూ. 32 లక్షల వరకు ధర పలికే ఉండే బో-లే టీ కూడా అభిస్తుంది.. వెయ్యి రూపాయలు అయిన కూడా ఆరోగ్యం కోసం ఆ టీ ను తాగడానికి జనం ఎగబడుతున్నారు.రోజుకు 1000 మందిలో 100 మంది ఖచ్చితంగా అక్కడ ఆగి టీ తాగుతారట.. అలా ఆ టీ ప్రాముఖ్యతను సంతరించుకుంది..