ఒకప్పుడు ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు ప్రేమలో పడటం అంటే అది పాపం అని భావించేవారు. కానీ కోర్టుల పుణ్యమా అని అలాంటి వాళ్లు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒకటి అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇంకా సమాజానికి భయపడి ముసుగు వేసుకుని మనసు చంపుకొని పెళ్లిళ్లు చేసుకుని ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే తనతో ప్రేమలో ఉన్న ఒక యువకుడు తనను వదిలించుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధం అవడంతో ఆ యువకుడిని దారుణంగా చంపిన మరో యువకుడు అనంతరం తాను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే పూణేలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా పని చేస్తోన్న రవిరాజ్‌ క్షీరసాగర్‌(24)కి, పుణె నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న సుదర్శన్‌ బాబురావు పండిట్‌(30)తో ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. ఇంతలో సుదర్శన్‌ కి కుటుంబ సభ్యులు వేరే యువతితో వివాహం నిశ్చయించారు. అయితే తనకు మరో యువకుడితో సంబంధం ఉందనే విషయాన్ని దాచి పెట్టి సుదర్శన్ పెళ్లికి సిద్ధమయ్యాడు  ఈ విషయం రవిరాజ్‌ చేవిన పడింది. తనను వదిలి పెట్టి మరోక యువతిని వివాహం చేసుకోవడానికి వీల్లేదని సుదర్శన్‌ని హెచ్చరించాడు రవిరాజ్‌.

అయితే సుదర్శన్‌ ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోక పోవడంతో  గత నెల 27న రవిరాజ్‌, సుదర్శన్‌ పీహెచ్‌డీ చేస్తోన్న నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది  ఈ క్రమంలో తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని సుదర్శన్‌ తేల్చి చెప్పాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవిరాజ్‌ అతడిని దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి.. ముఖాన్ని రాళ్లతో కొట్టి చంపాడు.  అనంతరం రవిరాజ్‌ తన నివాసానికి వెళ్లి ఆత్మహత్యయాత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రవిరాజ్‌తో అతడికున్న ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: