వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆమ్మో ఎండలు అని అందరు బయపడి పోతూ ఉంటారు. ఎందుకంటే ఎండాకాలం ఎండ తీవ్రతకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఆ ఎండని తలుచుకుంటే చాలు ఒళ్లంతా చెమట్లు పట్టేస్థాయి. ఇప్పటికి బానుడు తన ఉగ్ర రూపం దాల్చాడు. ఎండాకాలం ఇంకా మొదలు అవ్వకముందే ఎండలు మండి పోతున్నాయి. అయితే ఈ ఎండలను చూసి ప్రజలు బెంబేలు ఎత్తి పోతున్నారు.  



ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జనాలకు ఒక హాట్ న్యూస్  చెప్పింది.అదేంటంటే ఈ సారి  సమ్మర్ మరి  హాట్ గా ఉంటుందట.  ఈ ఏడాది(2021) వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని  ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి-మే మధ్య ఎండలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనాను సోమవారం(మార్చి 1,2021) ఆ సంస్థ వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో పగటి పూట భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని తెలిపింది.దక్షిణ, మధ్య భారత్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కొంచెం  తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది.



అయితే… తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పాటు, సముద్ర తీరాల దగ్గర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మన ఏపీ లో ఈసారి ఎండలు బాగా వేస్తాయి. ఏప్రిల్‌-జూన్‌కి సంబంధించిన వేసవి అంచనాలను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఐఎండీ తెలిపింది.ఇప్పటికే ప్రజలు  అప్పుడే ఎండలు మండిపోతున్నాయి అని ఆందోళనలో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది.ఇప్పుడే ఎండలు ఇలా వేస్తుంటే మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత ఎలా ఉంటుందో తలచుకుని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.. !!



మరింత సమాచారం తెలుసుకోండి: