తెలంగాణ లో షర్మిల రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ముందుగానే షర్మిల గట్టి టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. మీటింగ్ లు ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ఇటీవల షర్మిల విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశం వైరల్ గా మారింది. అందులో యువకుడు కన్నీరు పెట్టడం షర్మిల నేనున్నా అంటూ ఓదార్చడం తో ఈ వీడియో చక్కర్లు కొట్టింది. ఇక ఈ విదేవుపై రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు. సదరు యువకుడు ఓ చర్చి లో కీ బోర్డు ప్లేయర్ అని ఆరోపించారు. ఇదిలా ఉండగా షర్మిల పార్టీ పెడుతున్న నేపథ్యంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను కలుస్తున్నారు. తెలంగాణలో షర్మిల వెంట నడుస్తామని హామీలు ఇస్తున్నారు. కాగా ఈరోజు ఉదయం యాంకర్ శ్యామల లోటస్ పాండ్ లో షర్మిలను కలిశారు. షర్మిల ఇంట్లో 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు.

శ్యామల తో పాటు ఆమె భర్త నర్సింహారెడ్డి కూడా ఉన్నారు. కాగా ఈ మీటింగ్ లో తాను కూడా పార్టీలో చేరుతానని శ్యామల చెప్పినట్టు తెలుస్తుంది. మీటింగ్ అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడుతూ...ఫిబ్రవరి 10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి విషెస్ చెప్పామని...అప్పుడు షర్మిల ఇంట్లో లేకపోవడంతో ఈరోజు కలిసామని అన్నారు. ఇది కూడా ఫ్రెండ్లీ మీటింగే నని అన్నారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల సక్సెస్ అవుతారా అని మీడియా ప్రశ్నించగా....అది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నారని..మహిళలందరికి అడ్వాన్స్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇక మొన్న బ్రదర్ అనిల్ ను కలిసినప్పుడు కూడా శ్యామల ఫ్రెండ్లీ మీట్ అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇప్ప్పుడు షర్మిల ను కలిసినప్పుడు కూడా ఫ్రెండ్లీ మీట్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: