రన్ రాజా రన్ లాంటి  సినిమా తో వచ్చి ప్రేక్షకులను మెప్పిచ్చిన సుజిత్ తన రెండో సినిమానే ప్రభాస్ తో చేయడం అంటే పెద్ద అచీవ్ మెంట్ అని చెప్పాలి.. అయితే ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ తో పాన్ ఇండియా సినిమా చేసినా దర్శకుడు సుజిత్ కి తన తర్వాతి చిత్రానికి హీరో ఇప్పటివరకు దొరకలేదు. సాహో సినిమా రిలీజ్ అయ్యాక కానీ సుజిత్ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు.. సాహో సినిమా ఫ్లాప్ అవడంతో ఈ దర్శకుడి సినిమా రాత చాలా మారిపోయిందని చెప్పొచ్చు. అదే హిట్ అయితే టాలీవుడ్ లోని టాప్ హీరోలు అందరు ఈ దర్శకుడి కోసం క్యూలు కట్టేవారు..

ఆమధ్య చిరంజీవి తో సినిమా అంటూ కొంత స్క్రిప్ట్ వర్క్ చేసిన ఎందుకో ఆ సినిమా వర్కౌట్ అవలేదు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..  ఆ సినిమా తర్వాత రాబోయే  లూసిఫర్ రీమేక్ కి మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడు అనుకున్నా స్క్రిప్ట్ తో మెప్పించలేక సడెన్ గా సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. ఆ తరువాత దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా ఎంపిక అయ్యాడు.

ఇకపోతే సుజిత్ సుజిత్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. జీ స్టూడియోస్ సీఈఓ షరీఖ్ పటేల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ తరువాత సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని స్టోరీ కూడా ఆల్ మోస్ట్ సెట్టయినట్లు చెప్పారు.యూరి సినిమాతో ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన కథానాయకుడు విక్కీ కౌషల్ తో సుజిత్ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక అందులో మరో పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను సంప్రధించినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పై ఇటీవల చర్చలు కూడా జరిపారట. అయితే సుదీప్ ఇంకా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో సుదీప్ ఫుల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: