తనపై సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేనని ఆయనకు అర్ధమైంది. ముఖ్యంగా టీడీపీలోని కొందరు తన సామాజిక వర్గానికి చెందిన నాయకులే.. వైశ్య సామాజిక వర్గాన్ని తనకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మంత్రికి ఉప్పందింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తనపై విమర్శలు.. ప్రతివిమర్శలు ఎక్కువగా వస్తున్నాయని మంత్రిగారు భావించారు.. అదే సమయంలో తన పార్టీలోనే కీలక నేతగా ఉన్న విజయనగరం జిల్లాకు ఒక వైశ్య నాయకుడు కూడా తనపై వ్యతిరేకత పెంచే క్రమంలో పావులు కదుపుతున్నట్టు మంత్రిగారు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే.. ముగ్గురు నాయకులు మాత్రమే వైశ్య సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వీరిలో వెలంపల్లికి మాత్రమే మంత్రి పదవి లభించింది. ఈయనను తప్పించే ప్రయత్నం చేస్తే.. తమకు మంత్రి పదవి వస్తుందని సహజంగానే వారు భావిస్తున్నారు. దీంతో ఇటీవల జరుగుతున్న పరిణామాలను వారు వినియోగించుకుని.. మంత్రికి వ్యతిరేకంగా తమ సామాజిక వర్గం నేతలతోనే విమర్శలు చేయిస్తున్నారట. ఇక, కొన్నాళ్ల కిందట.. వైశ్య సామాజిక వర్గం ఓ కీలక కార్యక్రమానికి ఆహ్వానించినా.. మంత్రి హాజరుకాలేదు. ఆ సమయంంలో ఆయన అంతర్వేది రగడను పరిష్కరించే పనిలో పడ్డారు.
అయితే.. దీనిని సాకుగా చూపించి.. వైశ్య సామాజిక వర్గానికి మంత్రి విలన్గా మారిపోయారంటూ.. ఓ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో వెల్లంపల్లి స్వయంకృతాపరాథం కూడా ఉంది. వైశ్య వర్గం నుంచి ఆయన మంత్రిగా ఉన్న గతంలో వైశ్య మంత్రుల తరహాలో ఆ వర్గం వారికి చేరువ కాలేదంటున్నారు. దీంతో ఇప్పుడు తనపై సొంత వర్గంలోనే ఈ ప్రచారం జరుగుతున్నా మంత్రి తన వారినే మెయింటైన్ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వెల్లంపల్లి ఉన్నారు. దీంతో వెలంపల్లి ఏం చేయాలనే పరిస్థితిపై చర్చిస్తున్నారు.