తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లవచ్చు అనే ప్రచారం  మనం రోజు ఏదో ఒక విధంగా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు వెళ్తారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. మీడియా వర్గాలు మాత్రం ఈ విషయంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమందికి తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలతో సావాసం చేయడం అలాగే భారతీయ జనతా పార్టీ నేతలతో కూడా ఎక్కువగా స్నేహం చేయడం బెంగళూరులో బీజేపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేసుకోవడం వంటివి చేస్తూ వస్తున్నారు.

దీంతో మీడియా వర్గాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు మరో ఎమ్మెల్యే గురించి కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన సదరు ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటికి వెళ్లడానికి ఏకంగా భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక బీజేపీ నేత ద్వారా ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

గోదావరి జిల్లాలకు చెందిన సదరు నేతకు రాయలసీమ జిల్లాలకు చెందిన బీజేపీ నేతలతో మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ఎందుకు బీజేపీ లోకి వెళ్లాలి అనుకుంటున్నారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు మళ్లీ సీట్లు వచ్చే అవకాశం లేదట. అందుకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ ద్వారా తన నియోజకవర్గంలో ఎలా అయినా సరే సీటు సంపాదించుకోవచ్చు అనే భావన లో ఆయన ఉన్నారని టాక్. అందుకే బీజేపీ ఎంపీ ద్వారా ఆయన ఇప్పుడు పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: