మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ వైకాపాలో చేరిన సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ  జగన్‌ పాలన చూసి చాలా మంది వైసీపీలోకి రావాలని భావిస్తున్నారని, గంటా శ్రీనివాసరావు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపారని, జగన్‌ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు విజయసాయి రెడ్డి.



గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ తదితరులు ఇప్పటికే వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అనుచ‌రుడు, టీడీపీ నేత కాశీ విశ్వ‌నాథ్ విశాఖ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు ప‌లువురి స‌మ‌క్షంలో వైసీపీలోచేరారు.ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు వైసీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. గంటా త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆపార్టీ నంబర్ 2, సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.



గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ బుధవారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలన చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని గంటా శ్రీనివాసరావు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపారని జగన్ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని సంచలన విషయాన్ని బయటపెట్టాడు.నిజానికి గంటా చేరికకు ఎప్పుడో రంగం సిద్ధమైనా  ఆయన ప్రత్యర్థి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇన్నాళ్లు వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఎందుకో విజయసాయిరెడ్డి మారిపోయి గంటాకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.



గంటా చేరికను మంత్రి అవంతి మాత్రం వ్యతిరేకిస్తున్నారు.అందుకే విజయసాయిరెడ్డి సమక్షంలో గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ చేరికకు మంత్రి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నాడు.దీంతో మరోసారి వైసీపీలో గంటా వర్సెస్ అవంతి పోరు మొదలైనట్టే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన గంటా ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన అవంతి కూడా గెలిచి మంత్రి అయ్యారు. ఈ ఇద్దరు గురు శిష్యులకు ఇప్పుడు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: