కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కూతురు పాలిట దుర్మార్గుడు అయ్యాడు. సమాజంలోని ద్రోహుల నుంచి కాపాడాల్సిన తండ్రి కామంతో కూతురు పై రెచ్చిపోతున్నాడు. ఏడాది నుంచి బాలిక పై అత్యాచారం చేస్తున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో  వెలుగు చూసింది. ఏడాది కాలంగా ఆ బాలికపై ఘాతుకానికి పాల్పడుతున్నప్పటికీ... తండ్రి జైలుపాలవుతాడనే భయంతో ఎవ్వరికీ చెప్పకుండా ఉండిపోయింది. ఎడాదవుతున్నా అతని అకృత్యాలు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని జహంగీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో ఓ బాలిక ఆరో తరగతి చదువుతున్నది. ఏడాది క్రితం ఇంట్లో తన తల్లి లేని సమయంలో కన్న తండ్రే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కాగా, గత నెల ఆ బాలిక అమ్మమ్మ చనిపోయింది. దీంతో ఆమె అప్పటి నుంచి తాత దగ్గరే ఉంటున్నది. ఈక్రమంలో ఫిబ్రవరి 28న అక్కడికి వెళ్లిన ఆమె తండ్రి మద్యం మత్తులో మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఏడాదిగా ఆమె అతని అఘాయిత్యానికి బలవుతునే వస్తుంది. ఆమె తన భర్తను నిలయడంతో ఇద్దరిపై దాడికి దిగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.


తండ్రి ఏడాదిగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై మొదటిసారి దాడి జరిగినప్పుడు తన తమ్ముళ్లు కూడా ఇంట్లోనే ఉన్నారని, అమ్మమ్మ ఇంటికి వెళ్లినా ఈ తంతు కొనసాగుతూనే ఉందని అందులో పేర్కొంది. ఇన్నాళ్లు తండ్రిని జైళ్లో పెడతారని భయం తో ఎవరికీ చెప్పలేదు. అలా చేస్తే మా ఇంట్లో అందరూ రోడ్డున పడతారని చెప్పలేదని చెప్పింది.ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మధ్య ప్రదేశ్ లో వెలుగు చూస్తుండటంతో ప్రజలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: