తెలంగాణ‌లో బీజేపీ దూకుడు రోజురోజుకు పెంచుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక విజ‌యం...గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాట‌డం త‌ర‌వాత బీజేపీ నాయ‌కుల్లో కొత్త జోష్ మొద‌లైంది. ఇక రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నూ స‌త్తాచాటే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంతోనే ప్ర‌చార స‌భ‌లు నిర్విహిస్తూ అధికార పార్టీపై విమ‌ర్శాస్త్రాలు కురిపిస్తుంది. ఈనేప‌థ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ఈరోజు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్ర‌చారం సంద‌ర్భంగా బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. భువ‌న‌గిరిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు పెద్దఎత్తున హాజ‌ర‌య్యారు. ప్ర‌చార కార్య‌క్ర‌మంలో బండి సంజ‌య్ మాట్లాడుతూ....నయీం అక్రమాస్తులను కేసీఆర్ మింగేశారని బండి సంజ‌య్ ఆరోపించారు. మింగేసిన ఆస్తుల‌ను పైసాతో స‌హా కక్కిస్తామ‌ని అన్నారు. కేసీఆర్ ఎప్పుడైతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పక్కన ఫొటో పెట్టాడో.. అప్పటినుండే ఆయన పతనం ప్రారంభమైందని సంజయ్ అన్నారు.

పార్టీ కార్యకర్తలే కాకుండా యువత, విద్యార్థులు, గ్యాడ్యుయేట్లు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని.. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్నారని సంజయ్ అన్నారు. ర్యాలీకి వచ్చిన స్పందన చూస్తే బీజేపీ విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్నారని సంజయ్ అన్నారు. పీఆర్వో విజయ్ కుమార్ అవినీతిపరుడని కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా...ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా ?  ఆ అవినీతిలో కేసీఆర్‌కి వాటా లేదా అని ప్ర‌శ్నించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కాద‌ని గల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కొంద‌రు మంత్రులు టీచ‌ర్ల‌ను హెచ్చరిస్తున్నార‌ని..మార్చ్ 14న టీచ‌ర్ల చేతిలో పెన్నులు గ‌న్నులుగా మారి కేసీఆర్ గుండెల్లో గుచ్చుతాయ‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: