మున్సిపల్ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో అందరూ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. నిన్న హిందూపురం పట్టణ పరిధిలోని నిక్కంపల్లి , బోయపేట లలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారంలో బాలకృష్ణ ప్రజలకు వివరించారు.ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యలు తీర్చడానికి గొల్లపల్లి ద్వారా నీటి అందజేశామన్నారు. టిడిపి హయాంలో ఎక్కడా దోపిడీలు జరగలేదని , వైసీపీ ప్రభుత్వంలో ఇసుక,మద్యం అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. 

యువతను పాడు చేసే విధంగా ఎక్కడ చూసిన గంజాయి దొరుకుతుంది అని ఆయన విమర్శించారు. వ్తెసీసీ గ్రూపులు ఎక్కువయి ప్రజల మీద పడ్డారని ఆయన అన్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట పడాలంటే తెలుగుదేశం పార్టీకీ ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు ఆయన. వ్తెసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేసిన అభివృద్ధి ప్తె శ్వేతపత్రం విడుదల చేయాలని బాలయ్య డిమాండ్ చేశారు. 

అలానే రాష్ట్రంలో అన్ని చోట్ల బెదిరించినట్టుగా హిందూపురంలో కూడా బెదిరిస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరని బాలకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రమంతా ఏకగ్రీవ లు అయినా హిందూపురంలో మాత్రం కానివ్వలేదని అన్నారు. నంది ముందు కాలు దువ్వితే రంగు మార్చిన పందిలాగా తయారు అవుతారని అన్నారు. కారు కూతలు కూస్తే కాపాలం పగిలిపోవాలన్న ఆయన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందనని ఇసుక మాఫియా... మద్యం మాఫియా రాజ్యమేలుతోందని.. యువత భవిష్యత్తు అంధకారమే అయ్యిందన్నారు. జవాబు దారి తనం వున్న పార్టీ కి ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: