జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏ క్షణం ఎలా మలుపు తిరుగుతుందో కూడా చెప్పలేము. ఇక ప్రేమ కూడా అంతే. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు. ప్రేమ కొందరికి సంతోషాన్ని ఇస్తే.. మరికొందరికి వారి జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను ఇస్తుంది. తాజాగా ఓ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇంట్లో పెద్దలు కూడా వారి వివాహానికి ఒకే చెప్పారు. కానీ అంతలోనే పెళ్లి కొడుకు పెళ్ళికి నిరాకరించడంతో మనస్తాపంతో యువతీ ఆత్మహత్య చేసేసుకుంది. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. అదే జిల్లాకు చెందిన పూతలపట్టు మండలం బందార్ల పల్లె గ్రామానికి చెందిన మురళి కుమారుడు భరత్ అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక వారిద్దరి కుటుంబసభ్యులు చర్చించుకుని పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెద్దలు ఈ నెల 3వ తేదీన ఉదయం 3 (తెల్లవారితే గురువారం) వివాహం ఖాయం చేశారు. శుభలేఖలు కూడా ముద్రించారు. వాళ్లు పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇలా ఉండగా, వారం రోజుల క్రితం యువకుడు పెళ్లికి నిరాకరించాడు.

ఈ విషయంపై సుష్మ, భరత్ మధ్య పంచాయతీ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. అయితే ఇద్దరి మధ్య గొడవ సర్దుకుంటారని అనుకున్నారు. పెళ్లికి చేసుకుంటారని సంతోషపడ్డారు. చివరకు తన కుమార్తె మృతి చెందిందని వచ్చిన వార్తతో అవాక్కయ్యారు.పెళ్లికి భరత్ నిరాకరించడంతోనే సుష్మా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభలేఖలు ముద్రించి పెళ్లి రోజున ఇలాంటి ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తమను కలచివేసిందని వాపోయారు. తమకు న్యాయం చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: