ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా శరవేగంగా కరోనా  వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాకపోవడానికి ముందుండి మరి ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది పోలీసులకు ముందుగా వ్యాక్సిన్  అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇటీవల దేశ ప్రధాని నరేంద్రమోదీ వ్యాక్సిన్ వేసుకుని రెండో దశ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు అన్న విషయం తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైనది. ఎంతోమంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారన్న  విషయం తెలిసిందే. ఇకపోతే మొదట్లో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ పై ఎన్నో రకాల అనుమానాలు తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది వైద్య సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాలేదు.   కాగా  మూడవ దశ క్లినికల్ ట్రయల్స్  ఫలితాలు రాకుండానే ఎలా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవలే కరోనా  నిరోధక టీకా అయినా కోవాగ్జిన్  మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బయటకి ఇటీవలే ప్రకటించింది.  కరోనా నివారించడంలో కోవాగ్జిన్  మధ్యంతర  సామర్ధ్యం 81 శాతం అంటూ భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త రకంస్ట్రెయిన్  వైరస్ పై కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది. అయితే  ఇప్పటి వరకు మొదటి నుంచి మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 27 వేల మంది వాహనదారులపై పరీక్షలు నిర్వహించారు..  కేవలం మూడవ  దశలోనే 25800 మంది వాలంటీర్ల పై పరీక్షలు నిర్వహించామని భారత్ బయోటెక్ పేర్కొంది.  అయితే ఇప్పటికి కూడా ఎంతోమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు విడుదలైన ఫలితంతో అందరిలో  ధైర్యం నిండిపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: