ధర్మవరం టౌన్లో ఉన్న 40 వార్డులకు గానూ టీడీపీ పోటీలో ఉన్నది కేవలం 30 వార్డుల్లోనే..! అంటే 10 వార్డుల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి గత ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలో చేరిపోయాడు. ఆ తర్వాత ఈ నియోజకవర్గం బాధ్యతలను పరిటాల ఫ్యామిలీకి ఇచ్చింది తెలుగుదేశం అధిష్టానం. అయితే శ్రీరామ్, సునీతల్లో ఎవరో ధర్మవరం, ఎవరు రాఫ్తాడులో పోటీ చేస్తారో తేల్చుకోవాలని బాబే ఆప్షన్ ఇచ్చారు. అయితే ఆ ఫ్యామిలీ ధర్మవరం వచ్చేందుకు ఇష్టపడడం లేదన్నట్టుగా ఉంది.
ట్విస్ట్ ఏంటంటే... ఈ 40 వార్డుల్లో టీడీపీ కార్యకర్తలను మీటింగ్ అంటూ పిలిచి నామినేషన్లు వేయించారు. ఆ తర్వాత కొందరు ఇదేంటి చెప్మా అంటూ తమ నామినేషన్లు గడువులోగా కొందరు ఉపసంహరించుకున్నారు. దీంతో పది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వార్డుల్లో మాత్రం పోటీ కొనసాగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలోనే ఎప్పుడూ టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది. గత 2019 ఎన్నికల్లోనూ ధర్మవరం టౌన్లో టీడీపీకి మంచి ఓట్లు పడ్డాయి. అలాంటి చోట ఇప్పుడు పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితి.