ప్రతి ఒక్కరు కూడా సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో రోజుల నుంచి తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఒక మంచి ఇల్లు కొనుగోలు చేయడానికి మంచి ఆఫర్ వచ్చేంత వరకు వేచి చూస్తూ ఉంటారు.  ఒకవేళ మీరు కూడా ఇలా ఇల్లు కొనుగోలు చేయడానికి మంచి ఆఫర్ వచ్చేంత వరకు వేచి చూస్తూ ఉంటే మీకు ఇదే సదవకాశం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మార్కెట్లో ఉన్న ధర కంటే అతి తక్కువ ధరకే ఇల్లు కొనుగోలు చేసే ఒక అదిరిపోయే ప్లాన్ మీ కోసం సిద్ధంగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ తీపికబురు మీ కోసం సిద్ధం చేసింది.



 ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతి ఎక్కువ కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది కూడా ఈవేలం  నిర్వహిస్తూ ఉంటుంది.  ఇక మరోసారి నేడు  ఈవేలం నిర్వహించేందుకు సిద్ధమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  తక్కువ ధరకే ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది ఒక సదవకాశం అని చెప్పవచ్చు.


 మీకు నచ్చిన ప్రాపర్టీని మీకు నచ్చిన ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. హౌసింగ్ రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ఇలా పలు రకాల ప్రాపర్టీ లు అందుబాటులో ఉన్నాయి. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ తోపాటు ప్లాంట్ అండ్ మిషనరీ వెహికల్స్ ఇలా  మీకు నచ్చిన బిడ్  దాఖలు చేయడానికి అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ సోషల్ మీడియా వేదికగా ఈ వేలం  నిర్వహించనున్నట్లు వెల్లడించింది.  ఇందులో పాల్గొనాలకునేవారు ఎస్బిఐ బ్రాంచ్ కి వెళ్లి కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించి కొంత డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.  తర్వాత లాగ్ ఇన్ ఐడి పాస్వర్డ్ వస్తాయి. దాని  సాయంతో వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: